Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments Over AP Police1
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్‌ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్‌ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్‌ డెత్‌ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్‌ డెత్‌’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్‌ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్‌ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్‌సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Chinese Media Global Times blocked on X in India2
చైనా, తుర్కియేకు షాకిచ్చిన భారత్‌

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ ఉద్రిక్తతల వేళ ఓవరాక్షన్‌ చేస్తున్న చైనా, తుర్కియే విషయంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్‌ టైమ్స్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌ బ్లాక్‌ చేసింది. అలాగే, తుర్కియో బ్రాడ్‌కాస్ట్‌ టీఆర్‌టీపై భారత్‌ నిషేధం విధించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు భారత్‌ స్పష్టం చేసింది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై చైనా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్‌.. పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఈ నేపథ్యంలో చైనా చర్యలకు భారత్‌ కౌంటరిచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌లో బ్లాక్‌ చేసేసింది. కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్‌ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచింది.The 'X' account of Chinese propaganda media outlet 'Global Times' withheld in India. pic.twitter.com/B9Q941FTjX— ANI (@ANI) May 14, 2025 ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 ప్రదేశాల్లో 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. కానీ పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ..‘ఆపరేషన్ సిందూర్‌పై పాక్ అనుకూల సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మీడియా సంస్థలు వాటి మూలాలను నిర్ధారించకుండా ఈ దుష్ప్రచారాన్ని వ్యాపింపజేయడం జర్నలిజం నైతికతకు విరుద్ధం’ అని వ్యాఖ్యానించింది. భారత సమాచార శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) Fact Check వెల్లడించిన విషయాల ప్రకారం, గతంలో కూలిన యుద్ధ విమానాల దృశ్యాలను ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూలిపోయినవిగా ప్రచారం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Ravindra Jadeja Has Now The Longest Streak As Number 1 All Rounder In Test History3
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ల జడేజా టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. 2022, మార్చి 9న విండీస్‌ ఆటగాడు జేసన్‌ హెల్డర్‌ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్‌ ర్యాంక్డ్‌ టెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో దిగ్గజ ఆల్‌రౌండర్లైన జాక్‌ కల్లిస్‌, కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్‌లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్‌ మిరాజ్‌ (బంగ్లాదేశ్‌), మార్కో జన్సెన్‌ (సౌతాఫ్రికా), పాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా), షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌) ఉన్నారు. మెహిది హసన్‌ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్‌ను కింది​కి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్‌కు జడేజాకు మధ్య 73 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంది.ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న జడేజా జూన్‌లో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతను.. టెస్ట్‌, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

BSF Jawan Purnam Kumar Shaw Relesed By Pakistan4
భారత్‌ విజయం.. పాక్‌ నుంచి BSF జవాన్‌ విడుదల

సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌పై దౌత్యం విషయంలో భారత్‌ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్‌ఎఫ్‌ జవాన్ పీకే షాను పాకిస్తాన్‌ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్‌ విడిచిపెట్టింది. దీంతో, సదరు జవాన్‌ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బీఎస్‌ఎఫ్‌కు చెందిన భారత జవాన్‌ పూర్ణం కుమార్‌ షా అనుకోకుండా పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్‌ పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్‌.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో, 20 రోజుల తర్వాత పీకే షాను.. ఈరోజు పాకిస్తాన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్‌ను భారత్‌కు అ‍ప్పగించింది. Today BSF Jawan Purnam Kumar Shaw, who had been in the custody of Pakistan Rangers since 23 April 2025, was handed over to India: BSF(Pic Source: BSF) pic.twitter.com/TVzagO0AhK— ANI (@ANI) May 14, 2025182 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన షా పశ్చిమ బెంగాల్‌ వాసి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఇండో-పాక్‌ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్‌ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్‌ ప్రకారం ఫ్లాగ్‌ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్‌ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్‌ రైఫిల్‌ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

BJP NVSS Prasad Sensational Comments5
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం.. రేవంత్‌ స్థానంలో కేసీఆర్‌ సీఎం అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజీ డీల్‌ కుదిరిందని అన్నారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జూన్‌ రెండో తేదీన లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుంది. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరింది. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కామెంట్స్‌ చేశారు.

Suriya Sivakumar achieving six-packs with a 100-day plan for Kanguva6
హీరో సూర్యలా 100 రోజుల్లోనే సిక్స్‌ ప్యాక్‌ సాధ్యమేనా! నిపుణుల వార్నింగ్‌ ఇదే..

కోలీవుడ్‌ నటుడు సూర్య శివకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆయనకు సాటి లెరెవ్వరూ. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఒదిగిపోవడం సూర్య ప్రత్యేకత. తన వైవిధ్యభరితమైన నటనతో మంచి ప్రేక్షకాధరణ ఉన్న నటుడు. తాను నటించే పాత్ర కోసం మొత్తం ఆహార్యమే మార్చుకునేందుకు వెనకడుగువేయని గొప్ప నటుడు. గతేడాది రిలీజ్‌ అయ్యి కంగువా మూవీ కోస సూర్య ఎంతా కష్టపడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రేక్షకుల మన్ననలను పొందడంలో విఫలమైన ఆ మూవీలో సూర్య కంగువా ప్రాతకు పూర్తి న్యాయం చేశారు. ఆ పాత్ర కోసం సూర్య కేవలం వంద రోజుల్లోనే సిక్స్‌ ప్యాక్‌ బాడీని సాధించారు. నిజంగా అది అంత తక్కువ వ్యవధిలో సాధ్యమేనా..?. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తదితర విశేషాలు గురించి తెలుసుకుందామా..!.నిజానికి 49 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకి ఇది చాలా సవాలుతో కూడిన విషయం. ఆయన కూడా ఓ ఇంటర్వ్యూలో ఆ ఏజ్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీ అనేది..ఓ పర్వతాన్ని అధిరోహించే ఫీట్‌ లాంటిదని అన్నారు సూర్య. ఆ ఏజ్‌లో జీవక్రియ మందగిస్తుంది కాబట్టి చాలా కఠినమైన డైట్‌ని అనుసరించనట్లు చెబుతున్నారు. అంతేగాదు ఆ మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యేవరకు కూడా వందరోజులు.. మంచి ప్లాన్‌తో కూడిన డైట్‌ని అనుసరించానని అన్నారు. నిజానికి సూర్య మంచి భోజన ప్రియుడట. అలాగే తన భార్య, కూతురు కూడా తనలానే మంచిగా తింటారట, కొడుకు మాత్రం కాదట. అలాగే ఆయన అంతా ఎక్కువగా తిన్నప్పటికీ లావు అవ్వపని తన బాడీ తత్వం వల్ల ఎక్కువ బరువు పెరిపోతాననే భయం ఉండదని ధీమాగా చెబుతున్నారు సూర్య. ఇది మంచిదేనా..?నిపుణులు మాత్రం ఇంత తక్కువ వ్యవధిలో అలాంటి బాడీ ప్యాక్‌ సాధించడం అసాధ్యమని చెబుతున్నారు. ఇక్కడ హీరో సూర్య తక్కవ కార్బోహైడ్రేట్‌, చక్కెర, ఉప్పు దరిచేరని ఆహరం నిపుణుల పర్యవేక్షణలో తీసుకుని ఉండి ఉంటారు. అందువల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అలాగే సూర్య డైట్‌ ప్లాన్‌లో లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆర్ద్రీకరణ తదతరాలన్నిటికీ ప్రాధన్యాత ఇచ్చే ఫుడ్‌ని అందించి ఉండొచ్చని నిపుణుడు విద్యా చావ్లా అన్నారు. అయితే ఈ డైట్‌ అందరికీ సరిపడకపోవచ్చని అన్నారు. ఎందుకంటే.. ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. పైగా సరైన ఫిట్‌నెస్‌, వర్కౌట్‌లతో కూడిన సిక్స్‌ ప్యాక్‌ బాడీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. అలాగే సెలబ్రిటీల మాదిరిగా తొందరగా బాడీ రూపురేఖలు మారిపోవాలనుకుంటే మాత్రం ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిదని సూచించారు నిపుణులు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: భారత సైన్యంపై రష్యన్‌ మహిళ ప్రశంసల జల్లు..!)

Donald Trump Defends Qatar Boeing 747 Gift7
ఖతార్‌లో ట్విస్ట్‌.. ట్రంప్ ఆశ... అడియాస?

ఖతార్ రాజకుటుంబం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8 విమానాన్ని బహుమతిగా స్వీకరిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ పని సముచితమేనా అని ఎవరైనా అడిగితే.. ‘అంత ఖరీదైన విమానాన్ని ఖతార్ ఉచితంగా ఇస్తానంటుంటే వద్దని చెప్పడానికి నేనేమైనా వెర్రివాడినా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఖతార్ జెట్ నెల క్రితమే టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నట్టు ఫ్లైట్ రికార్డులను ఉదహరిస్తూ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ విమానాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే ఏర్పాట్లు ఆరంభమై ఉండొచ్చని కూడా పేర్కొంది. ఈ నెల 8న విమానం శాన్ ఆంటోనియో చేరుకుందని, అప్పట్నుంచి అది అక్కడే ఉందని ‘శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్‌ న్యూస్’ తెలిపింది. విమానం రెట్రో ఫిట్టింగ్ పనులను డిఫెన్స్ కాంట్రాక్టర్ ‘ఎల్3 హ్యారిస్ టెక్నాలజీస్’కు ట్రంప్ పురమాయించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ మరో కథనం ప్రచురించింది. ఖతార్ ఫ్రీగా ఇస్తున్న 13 ఏళ్లనాటి ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసినప్పటికీ దాని విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.2,100 కోట్లు) మాత్రమేనని ఆ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.ఇక చావు కబురు చల్లగా చెప్పినట్టు.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి అనువుగా, ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్పు చేర్పులు (ఓవర్ హాలింగ్) చేపట్టడానికి ఆ విమానం విలువకు మూడు రెట్లు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. 40 ఏళ్ల నాటి తమ పాత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఖతార్ సూపర్ లగ్జరీ విమానంలో దర్పంతో తిరగాలని ట్రంప్ ఉబలాటపడుతున్నారు. దీనిపై ఆయన సొంత రిపబ్లిక్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ‘కమాండర్ ఇన్ చీఫ్’ హోదాలో అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి వీలుగా ఖతార్ విమానానికి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ తరహాలో మార్పులు చేయడానికి బాగానే సమయం పడుతుందట.కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతోపాటు విమానంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి కొన్ని నెలల నుంచి రెండేళ్ల దాకా వ్యవధి పట్టవచ్చని భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని, అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ముగిసేలోపు ఆ ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని అమెరికా అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా ఖతార్ విమానంతో గూఢచర్యం, నిఘా సమస్యలున్నాయని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ వ్యాఖ్యానించారు. ఖతార్ కానుకను అంగీకరించడమంటే తమ భద్రతాపరమైన కీలక వ్యవస్థలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి చొరబడటానికి ఓ విదేశానికి అనుమతి ఇవ్వడమేనని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ జాక్ రీడ్ అభిప్రాయపడ్డారు.మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ పాయింట్!అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం.. కదిలే వ్యవస్థ లాంటిది. అధ్యక్షుడి భద్రతలో అమెరికా రక్షణ విభాగం రాజీపడదు. భద్రతాపరమైన లోపాలకు తావివ్వదు. అందుకే ఖతార్ విమానాన్ని ‘ఈకకు ఈక, తోకకు తోక పీకినట్టు’ ఫ్రేమ్ వరకు భాగాలుగా విడగొట్టి అమెరికా తొలుత దాన్ని ఆసాంతం శోధించాలి. బగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్ అమర్చి విమానాన్ని పునర్నిర్మించాలి. ఇంత పెద్ద తతంగం ఉంది మరి!.విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అన్యులెవరూ హైజాక్ చేయకుండా చూడాలి. ఎందుకంటే దేశాధ్యక్షుడు విమానంలో ప్రయాణించే సమయంలో మిలిటరీ ‘కమాండ్ అండ్ కంట్రోల్’కు ఆ ఎలక్ట్రానిక్ వ్యవస్థలే ఆయువుపట్టు. ఖతార్ విమానాన్ని ఇలా అప్గ్రేడ్ చేయడానికి, మెరుగ్గా తీర్చిదిద్ది ముస్తాబు చేయడానికి చాలా కాలం పట్టవచ్చు. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపుకునే వెసులుబాటు ఉంది. అయితే దేశాధ్యక్షుడు ప్రయాణంలో ఉండగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’కు గాల్లోనే ఇంధనం నింపిన సందర్భం ఇప్పటివరకు ఒక్కటీ లేదు. ఖతారీ సంప్రదాయ బోయింగ్ 747 విమానానికి గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యం లేదు. ఉదాహరణకు అణుదాడి జరిగిన సందర్భంలో నేలపై దిగకుండా అమెరికా అధ్యక్షుడి విమానం సురక్షితంగా ఎక్కువసేపు గాల్లోనే ఉండాల్సివస్తే... ఆ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయెలింగ్ సామర్థ్యం తప్పనిసరి! -జమ్ముల శ్రీకాంత్.

how AC Market Booming Demand Amid Sustainability Challenges8
వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీ

భారత ఎయిర్ కండిషనర్‌(ఏసీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సంవత్సరానికి 1.4 కోట్ల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, ప్రజల డిస్పోజబుల్ ఆదాయాలు(ఖర్చులన్నీ పోను మిగులు ఆదాయాలు) అధికమవ్వడం ఏసీల కొనుగోళ్లకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు వీటిని లగ్జరీ వస్తువుగా కాకుండా, అవసరంగా భావిస్తున్నారని చెబుతున్నారు. ఏసీల కొనుగోళ్లలో పెరుగుదల కంపెనీలకు శుభపరిణామమే అయినా ఇతర అంశాలకు సంబంధించి తీవ్ర సవాళ్లను ఎత్తి చూపుతుంది.పెరుగుతున్న డిమాండ్దేశంలో ఎక్కువ మంది ప్రజలు నగరాలకు తరలివెళ్తున్నారు. వారి ఆదాయాలు మెరుగుపడటంతో ఏసీ కొనుగోళ్లకు మెగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఏసీలు కలిగి ఉన్నవారు కొత్త టెక్నాలజీ వర్షన్‌ మోడళ్లకు అప్‌డేట్‌ అవుతున్నారు. దాంతో వీటి డిమాండ్‌ పెరుగుతోంది. ఏసీని కొంత మంది మధ్య తరగతి ప్రజలు స్టేటస్‌ సింబల్‌గా కూడా చూస్తున్నారు. ఇటీవల వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రికార్టు స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. వీటి వల్ల ఏసీ లగ్జరీ నుంచి అవసరంగా మారుతోంది.ఫైనాన్సింగ్‌ కంపెనీలు సైతం ఏసీ కొనుగోళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో సులువైన నెలవారీ వాయిదా పద్ధతులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇది కూడా ఏసీల అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతుంది. 2050 నాటికి రెసిడెన్షియల్ ఏసీల వినియోగం ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు అధికమవుతుందని, దీనివల్ల విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాళ్లు..దేశంలో అధికశాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయ విద్యుత్‌ తయారీ స్థానంలో పునరుత్పాదక ఇంధన తయారీని అభివృద్ధి చేస్తున్నా ఇంకా ఆమేరకు ప్రయత్నాలు కొంతమేరకే ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకైతే వేసవి కాలంలో ఎక్కువగా వాడే ఏసీలకు అవసరమయ్యే అధిక విద్యుత్‌ను బొగ్గు మండించడం ద్వారానే తయారు చేస్తున్నారు. ఇది భారత విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఏసీల్లో నుంచి వెలువడే గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలు వాతావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది.ఇదీ చదవండి: చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!పరిష్కారాలు..పునరుత్పాదక ఇంధన తయారీని పెంచాలి. సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. తక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యూపీ) రిఫ్రిజిరెంట్లతో కూడిన హై స్టార్ రేటెడ్ ఏసీలను వాడాలి. ఏసీల్లో ఇన్నోవేటింగ్ కూలింగ్ టెక్నాలజీస్‌ను ఉపయోగించాలి. ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచడానికి అర్బన్ ప్లానింగ్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి ఏసీపై ఆధారపడటాన్ని పరిమితం చేయాల్సి ఉంది.

Monalisa Dancing Private Song With Actor Utkarsh Singh9
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో అస్సలు చెప్పలేం. ఊరగాయలు అమ్మినా ఫేమస్ అవ్వొచ్చు. పూసలు అమ్మినా సరే ఫేమస్ అయిపోవచ్చు. అలానే కొన్నాళ్లక్రితం జరిగిన కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిపోయిన మోనాలిసా ఇప్పుడు మరో అవకాశం అందుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) మోనాలిసాకు ఇదివరకే ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ ఇప్పుడు మరో ఛాన్స్ పట్టేసింది. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.సినిమా ఛాన్సుల మాటేమో గానీ కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది. మోనాలిసా ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. త్వరలో ఈమె నటించిన సాంగ్ రిలీజ్ అవుతుంది. అ‍ప్పుడు ఈమె సంగతేంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_)

China attempts to rename certain places in Arunachal Pradesh10
భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు

ఢిల్లీ: భారత్‌ విషయంలో డ్రాగన్‌ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.Here's the actual names and places of Arunachal Pradesh which China has renamed! 👇@MEAIndia has reiterated that creative naming will not alter the undeniable reality that Arunachal Pradesh was, is, and will always remain an integral and inalienable part of India. pic.twitter.com/o4rcgiflfK— Sashanka Chakraborty (@SashankGuw) May 14, 2025అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్‌ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటెన్‌ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.India’s Foreign Ministry slams China for presenting new names of cities in the state of Arunachal Pradesh, which China claims as its own:"Creative naming won’t alter the undeniable fact that Arunachal Pradesh was, is & will always remain an integral & inalienable part of India” pic.twitter.com/hsbLg3jbC7— DR Yadav (@DrYadav5197) May 14, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement